సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు
బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీస్ లు
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా చందూరు మండల కేంద్రం లోని విగ్నేశ్వర్ కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాస్ ఇంట్లో గురువారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి ఇంట్లో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. మామూళ్ల శ్రీనివాస్ ఇంటి కి తాళం వేసి మూడు రోజుల క్రితం గ్రామంలోని తన తండ్రి ఉంటున్న ఇంటికి వెళ్ళాడు. గుర్తు తెలియని దుండగులు గురువారం అర్ధరాత్రి తాళం వేసి ఉన్న ఇంటి తాళాలు పాలుగొట్టి ఇంట్లో బీరువా తాళాలు పగలగొట్టి బీరువాలో ఉన్న 8 తులాల బంగారు నగలు ఐదు తులాల వెండి నగలు 8000 రూపాయల నగదు ను ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరించారు బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చందూర్ పోలీసులు తెలిపారు.