కామారెడ్డి, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): ఆ కుటుంబం దేవుడిని దర్శి ంచుకు నేందుకు గుడికి వెళ్లింది. ఈలోపు దుండగులు ఆ ఇంట్లోకి చొరబడి ఆభరణాలు అపహరించి ఉడాయించారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో కుమ్మరి రంజిత్ అనే వ్యక్తి కుటుంబంతో నివసిస్తున్నాడు. ఇటీవల ఆయన కుటుంబంతో కలిసి వేములవాడ రాజన్న దర్శనా నికి వెళ్లాడు. శుక్రవారం రాత్రి 8 గంటలకు కుటుంబం తిరిగి స్వస్థలానికి వచ్చింది. ఇంటికి వచ్చే చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉంఇ. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలోని సుమారు ఏడు తులాల బంగారు నగలతో పాటు కొంత నగదు కనిపించలేదు. ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధారించుకుని బాధితుడు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. చోరీ జరిగిన ఇంటిని సదాశివనగర్ సీఐ సంతోశ్కుమార్ సందర్శించారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు.