23 May, 2026 | 6:50 PM

Breaking News

కష్టపడే కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది   •   ఎమ్మెల్యే మున్సిపాలిటీ లో ఎక్స్ టెన్షన్ కౌంటర్ గా మార్చారు   •   చట్టాలపైన అవగాహన లేకనే కేసుల్లో ఇరుక్కుపోతున్నారు   •   ఇతర రాష్ట్రాల కార్మికుల వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం   •   చోరీ కేసులో నిందితుడు అరెస్ట్.. బంగారం, వెండి వస్తువుల స్వాధీనం   •   పేరు మార్పిడి చేసిన రెవెన్యూ ఉద్యోగిని సస్పెండ్ చేయాలి   •   జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఛైర్మెన్ గా దూమల రాజ్ కుమార్   •   తాడువాయిలో జీలుగ విత్తనాల పంపిణీ   •   రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులుగా గడ్డం రాజశేఖర్ నియామకం   •   నందివాడలో ఉపాధి పనుల పరిశీలన   •  

ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా బుమ్రా

29-01-2025 12:29 AM

దుబాయ్: గతేడాది అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా 2024 ఏడాదికి గానూ ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికయ్యాడు. భారత్ తరఫున సర్ గార్‌ఫీల్డ్ సోబర్స్ అవార్డు అందుకున్న ఐదో క్రికెటర్‌గా బుమ్రా నిలిచాడు.

బుమ్రా కంటే ముందు ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016), కోహ్లీ (2017, 2018) ఉన్నారు. ఇప్పటికే ఐసీసీ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచిన బుమ్రా గతేడాది టీ20 ప్రపంచకప్‌లో 15 వికెట్లు తీసి భారత్ కప్ అందుకోవడంలో కీలకపాత్ర పోషించాడు.

2024లో ఆడిన 13 టెస్టుల్లో బుమ్రా 77 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు ఐసీసీ టెస్టు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ ర్యాంకు అందుకున్న బుమ్రా 907 రేటింగ్ పాయింట్లుకు సాధించి ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ సిరీస్ కోల్పోయినప్పటికీ  ఐదు టెస్టులు కలిపి 32 వికెట్లు పడగొట్టడం విశేషం.