బాలీవుడ్ సీనియర్ నటి కరీనా కపూర్ తనదైన అందచందాలు, నటన, అభినయంతో భారతీయ చిత్ర పరిశ్రమపై తనదైన ముద్ర వేసిన విషయం వేసింది. అంతటితో ఆగకుండా సినిమా నిర్మాతగానూ తన సత్తా చాటేందుకు నిర్మాణ రంగంలోకీ ప్రవేశించింది. శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్తో కలిసి కరీనా నిర్మాతగా వ్యవహరిస్తున్న తాజా చిత్రమే ‘ది బకింగ్హామ్ మర్డర్స్’. దీనికి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హన్సల్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు.
హన్సల్ తెరకెక్కించిన ‘స్కామ్ 1992’, ‘ఛల్’, ‘షాహిద్’, ‘సిటీలైట్స్’ వంటి చిత్రాలు ఆయనకు గొప్ప పేరు తెచ్చిపెట్టాయి. కరీనా, హన్సల్ కాంబోలో ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న తాజా చిత్రం ‘ది బకింగ్హామ్ మర్డర్స్’ విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 13న విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. కరీనా కథానాయకిగా థ్రిల్లర్ జానర్లో రూపొందిన ఈ సినిమా ఇంగ్లండ్ బ్యాక్డ్రాప్లో జరుగనుంది.