calender_icon.png 24 October, 2024 | 10:03 PM

ఎమ్మెల్యే చొరవతో బీటీ రోడ్డు మంజూరు

24-10-2024 07:54:46 PM

పినపాక,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధి గుండాల మండలంలోని జగ్గు తండా నుండి లక్ష్మీదేవిపల్లి గ్రామానికి పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల విలువగల బీటీ రోడ్డును గురువారం మంజూరు చేపించారు. అనేక సంవత్సరాల నుండి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్న గిరిజన గ్రామమైన లక్ష్మీదేవిపల్లికి ఎన్నికల సమయంలో వచ్చిన పాయం రోడ్డు వేపిస్తానని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వెళ్లాలన్నా, వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్ళాలన్నా, ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలలో పనులకై మండల కేంద్రానికి రావాలన్నా సరైన మార్గం లేక, ఉన్న మార్గంలో వాగులు, వంకలు ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఆ గిరిజన ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి. ఈ రోడ్డు మంజూరు ద్వారా మా కష్టాలకు మోక్షం లభించిందని ఆ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే పాయంకు లక్ష్మీదేవిపల్లి గ్రామస్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.