భూ తగాదాలే కారణం?
నల్లగొండ, అక్టోబర్ 16 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలం నారాయణపురం గ్రామంలో వృద్ధుడిని దారుణంగా హత్య చేశారు. గ్రామానికి చెందిన కాకునూరి కొండయ్య గౌడ్ (63) బుధవారం మధ్యా హ్నం ఇంటి పనిలో నియగ్నమయ్యాడు. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని నలుగురు అతడిని బలవంతంగా ఆటోలో ఎక్కించి గ్రామ శివారుకు తీసుకెళ్లి కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు.
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా దుండగులు పరారయ్యారు. స్థానికులు కొండయ్యను దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. భూ తగదాలే హత్యకు కారణమని అనుమానా లు వ్యక్తవుతున్నాయి. తెలిసిన వారే సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు మృతుడి కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలాన్ని మిర్యాల గూడ రూరల్ సీఐ వీరబాబు, మాడుగులపల్లి ఎస్సై కృష్ణయ్య పరిశీలించారు.