హైదరాబాద్: చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దుండగుడు కర్నాటకకు చెందిన మహిళను గొంతు కోసి హత్య చేశారు. మృతురాలిని నల్లగండ్ల లక్ష్మీవిహార్ వాసి విజయలక్ష్మి (32)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. హత్య అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగి పోయినట్లు తెలుస్తోంది.