calender_icon.png 23 October, 2024 | 10:03 PM

యువకుడి గొంతుకోసి దారుణ హత్య

12-09-2024 03:00:31 AM

  1. సూర్యాపేట జిల్లాలో ఘటన 
  2. పాత కక్షలతోనే దాడి?

సూర్యాపేట/నాగారం, సెప్టెంబర్ 11: యువకుడి గొంతుకోసి కిరాతకంగా చంపిన ఘటన సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం డి కొత్తపల్లి గ్రామ శివారులోని ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వ సమీపంలో మంగళవారం రాత్రి జరిగింది. తిరుమలగిరి మున్సిపాలిటీకి చెందిన వనగండ్ల కిరణ్‌కుమార్(27) కారు డ్రైవర్‌గా జీవనాన్ని సాగిస్తున్నాడు. మంగళవారం కిరాయికి వెళ్లి రాత్రి కారును తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని తిరుమల హిల్స్‌లోని సాయిబాబా ఆలయం వద్ద పార్క్ చేశాడు. ద్విచక్రవాహనంపై తన ఇంటికి బయలుదేరాడు.

తెల్లవారేసరికి డి కొత్తపల్లి గ్రామశివారులో పర్సాయిపల్లికి వెళే.్ల దారిలో ఎస్‌ఆర్‌ఎస్పీ కాల్వ సమీపంలో దారుణంగా హత్య చేయబడి ఉన్నాడు. సూర్యాపేట డీఎస్పీ జి రవి, సీఐ రఘువీర్‌రెడ్డి సిబ్బందితో అక్కడికి చేరుకుని పరిశీలించగా గొంతుకోసి చంపేసినట్లు నిర్ధారించారు. కాగా అదే గ్రామానికి చెందిన పత్తేపురం విజయ్ అనే వ్యక్తి పాత కక్షలతో కుటుంబ సభ్యులు, అనుచరులతో కలిసి కిరణ్‌కుమార్‌ను చంపేశారని మృతుడి సోదరుడు వనగండ్ల సాయిబాబు పోలీసులు ఫిర్యాదు చేశాడు.