- జడ్చర్ల మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాసం
- తీర్మానం పెట్టిన సొంత పార్టీ కౌన్సిలర్లు
- చైర్పర్సన్ పదవి నుంచి వైదొలిగిన లక్ష్మి
మహబూబ్నగర్, జూలై 25 (విజయక్రాంతి): ఎక్కడైనా అధికార పక్షం మీద ప్రతి పక్షం అవిశ్వాసం పెట్టడం చూస్తుంటాం. కానీ, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మున్సిపల్ చైర్పర్స న్పై బీఆర్ఎస్ కౌన్సిలర్లే అవిశ్వాసం పెట్టడం గమనార్హం. మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిని పదవి నుంచి దింపేందుకు సొంత పార్టీ కౌన్సిలర్లే అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు గత నెలలో కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో ఆర్డీవో నవీన్, మున్సిపల్ కమిషనర్ రాజయ్య సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు. దీంతో మొత్తం 27 మందిలో ఆమె కాకుండా 26 మంది కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపడంతో లక్ష్మీ పదవి నుంచి వైదోలగాల్సి వచ్చింది.