calender_icon.png 16 October, 2024 | 4:01 PM

మూసీ పేరుతో లూటీ

16-10-2024 12:44:32 PM

హైదరాబాద్: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలగొడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మూసీ పేరుతో లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదన్న కేటీఆర్ నాచారం, ఉప్పల్ లో తామే మూసీ సివరేజ్ ప్లాంట్స్ ఏర్పాటు చేశామన్నారు. సివరేజ్ ప్లాంట్స్ పూర్తయితే మూసీ దిగువన శుద్ధి చేసిన నీళ్లే వెళతాయన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. నల్గొండకు నీళ్లు ఇవ్వడం మీకు ఇష్టం లేదా అని సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్డర్లు, పెద్ద వ్యాపారులను బెదిరించేందుకే హైడ్రాను తీసుకొచ్చారని కేటీఆర్ ఆరోపించారు.