calender_icon.png 20 September, 2024 | 2:32 PM

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన బీఆర్‌ఎస్

19-09-2024 12:53:23 AM

స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్

మెదక్, సెప్టెంబరు 18 (విజయక్రాంతి): పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, రాష్ట్రాన్ని రక్షించేలా ప్రభుత్వానికి శక్తి ఇవ్వాలని రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేటలోని మాధవానంద సరస్వతీ ఆశ్రమంలో బుధవారం ఆ ఆశ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి స్వామి చాతుర్మాస దీక్ష విరమణ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో స్పీకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ మీడియాతో మాట్లాడుతూ.. శివరాత్రి తెల్లారి సెలవు ప్రకటించాలని మాధవానంద స్వామివారు కోరారని.. ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలయ్యేలా ప్రభుత్వానికి శక్తిని ఇవ్వాలని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.