డా.రాజయ్య, మెతుకు ఆనంద్, కల్వకుంట్ల సంజయ్కు బాధ్యతలు
హైదరబాద్, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): గాంధీ హాస్పిటల్లో మాతాశిశు మరణాలతో పాటు రాష్ట్రంలో నెలకొన్న దుర్భర వైద్య ఆరోగ్య పరిస్థితుల అధ్యయనానికి బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు శుక్రవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు ఒక ప్రకటనను విడుదల చేశారు. కమిటీలో మాజీ వైద్యారోగ్య శాఖ మంత్రి డాక్టర్ రాజయ్యతో పాటు ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్, మాజీ ఎమ్మెల్యే డా.మెతుకు ఆనంద్ ఉన్నారు. డా.రాజయ్య ఆధ్వర్యంలో ఈ కమిటీ గాంధీ ఆసుపత్రితో పాటు రాష్ట్రంలోని పలు ఆసుపత్రులను సందర్శించి పరిస్థితులను అధ్యయనం చేస్తుందని, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సూచనలతో కూడిన నివేదికను అందిస్తుందని కేటీఆర్ తెలిపారు.