మాజీ మంత్రి, ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఫైర్
నిజామాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): హైడ్రా, రైతు రుణమాఫీపై బీఆర్ ఎస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి అన్నారు. నిజామాబాద్లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అర్హులైన వారికి ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంద న్నారు. హైడ్రా కూల్చివేతల విషయంలో ప్రజలను బీఆర్ఎస్ తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
మూసి పరివాహక ప్రాంతంలో పేద ల ఇళ్లను ప్రభుత్వం కూల్చదన్నారు. భవిష్య త్ తరాల కోసం ప్రభుత్వ భూములను పరిరక్షించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఉన్న దని చెప్పారు.
సమావేశంలో రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్-బిన్-హమ్దాన్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, పీసీసీ ప్రధాన కార్యదర్శులు నగేష్రెడ్డి, గడు గు గంగాధర్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేణు, బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి ముత్యాల సునీల్రెడ్డి, నిజామాబాద్ మార్కె ట్ కమిటీ చైర్మన్ ముప్పా గంగారెడ్డి, నాయకులు నరాల రత్నాకర్, వేణురాజ్, సంతోష్, శేఖర్గౌడ్ పాల్గొన్నారు.