calender_icon.png 21 October, 2024 | 12:37 AM

రైతు భరోసా అందించాలంటూ బిఆర్ఎస్ శ్రేణుల నిరసన

20-10-2024 02:45:34 PM

పటాన్చెరు, (విజయక్రాంతి): రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు చేసిన ప్రకటనను నిరసిస్తూ, ప్రతి రైతుకు రైతు భరోసా అందించాలంటూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టాయి. ఆరు గ్యారెంటీ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ.. రైతులను నిండా ముంచుతోందని ఆరోపించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా పథకాల అమలులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు. త్వరలోనే రైతులు కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి, బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, జింకల వెంకటేశం గౌడ్, మెట్టు కుమార్ యాదవ్, శ్రీకాంత్ గౌడ్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.