calender_icon.png 30 September, 2024 | 10:41 PM

కార్యకర్తలకు అండగా బీఆర్ఎస్ పార్టీ

30-09-2024 08:35:18 PM

బీఆర్ఎస్ నాయకులు డా. రాజా రమేష్ 

మందమర్రి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీకి వెన్నుముకగా నిలుస్తున్న కార్యకర్తలకు, వారి కుటుంబాలకు బిఆర్ఎస్ పార్టీ నిరంతరం అండగా ఉండి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుందని బిఆర్ఎస్ చెన్నూరు నియోజకవర్గ నాయకులు డా.రాజా రమేష్ స్పష్టం చేశారు. మండలంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డ్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుర్మ కుమార్ ఇటీవల మృతి చెందగా సోమవారం పట్టణంలో కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి పార్టీ అందించిన రెండు లక్షల రూపాయల బీమా చెక్కును వారికి అందజేశారు. ఈ సందర్భంగా డా.రాజా రమేష్ మాట్లాడుతూ... రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రమాద బీమా రెండు లక్షల రూపాయల చెక్కును కార్యకర్త కుటుంబానికి అందజేయడం జరిగిందని, కార్యకర్త కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 9వ వార్డ్ కౌన్సిలర్ పారిపెల్లి తిరుపతి, పార్టీ నాయకులు బడికెల సంపత్, రవి, వంశీకృష్ణరావు, తిరుపతి లు పాల్గొన్నారు.