14-04-2025 07:20:20 PM
అశ్వాపురం (విజయక్రాంతి): డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా సోమవారం అశ్వాపురం మండలం బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో భారతరత్న డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం,సూదిరెడ్డి గోపిరెడ్డి,చిలక వెంకటరమయ్య,చుంచు రామ్మూర్తి,మండల యువజన అధ్యక్షులు గద్దల రామకృష్ణ,ముత్యాల నరహీంహరవు,చల్లా రాజేష్,మిట్టకంటి సురేందర్ రెడ్డి,డేరింగుల శేఖర్,గొల్లపల్లి సురేష్,బచ్చల అభిలాష్,తదితర నాయకులు పాలొన్నారు.