నిజామాబాద్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా లో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. ముగ్గురు మైనార్టీ నేతలు ఎంఐఎం పార్టీలో చేరారు. నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ మైనార్జీ విభాగం లో కీలక నేతలుగా ఉన్న మాజీ డి ప్యూటీ మేయర్ మీర్ మజాజ్ అలీ, వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ ఫయాజ్, పార్టీ సీనియర్ నాయకుడు అమర్ ఫారూఖ్ సోమవారం హైదాబాద్లో మజ్లీస్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ సమక్షంలో ఆ పార్టీలో చేరారు.