హైదరాబాద్,(విజయక్రాంతి): నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. కిమ్స్ ఆసుపత్రిలో కొద్ధి రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మంత్రి ఉత్తమ్ తండ్రి నలమాద పురుషోత్తం రెడ్డి ఆదివారం కన్నుమూశారు. పలువురు నేతలు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని పరామర్శించి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కేపీ వివేకానంద, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్, బీర్ల ఐలయ్య నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమర్ రెడ్డిని వైఎస్ షర్మిల పరామర్శించారు. జూబ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో సాయంత్రం 6 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.