calender_icon.png 24 October, 2024 | 2:49 PM

ఆదిలాబాద్‌లో రైతు ధర్నా.. కేటీఆర్‌తో బయలుదేరిన బీఆర్ఎస్ నాయకులు

24-10-2024 12:25:15 PM

కామారెడ్డి: కామారెడ్డి జిల్లా రాజాంపేట మండలం పోందుర్తి చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కి  పార్టీ కామారెడ్డి జిల్లా అద్యక్షలు యంకె ముజిబోద్దిన్, నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంలీలా మైదానంలో జరిగే రైతు ధర్నాలో పాల్గొనేందుకు భారీ ఎత్తున కామారెడ్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుండి, ఆదిలాబాద్ లో జరిగే రైతు ధర్నా కార్యక్రమానికి కేటీఆర్ తో బయలుదేరిన కామారెడ్డి బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు బయలుదేరారు.