హైదరాబాద్,(విజయక్రాంతి): ప్రజలను బీఆర్ఎస్ నేతలు తప్పుదోవ పట్టిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. మాజీ మంత్రి హరీశ్ రావు అవగాహన ఉన్న వ్యక్తి, కానీ ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు ఏం చేయాలో తెలుసాని దానం నాగేందర్ పేర్కొన్నారు. హైడ్రా బాధితుల వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందంతో కలిసి మాజీ మంత్రి హరీశ్ రావు ఆదివారం మూసీ రివర్ ఫ్రంట్ బాధితులను కలిశారు. పార్టీ తరుపున న్యాయపరంగా బాధితుల తరుపున పోరాటం చేస్తామని బీఆర్ఎస్ ప్రకటించిన విషయం తెలిసిందే.