26-03-2025 01:19:32 AM
పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
జుక్కల్, మార్చి 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ అనే సీనియర్ బి ఆర్ ఎస్ నాయకుడు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మంగళవారం బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు మద్నూర్ మాజీ సొసైటీ ఛైర్మన్ పాకాల విజయ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.