calender_icon.png 24 October, 2024 | 2:18 AM

ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ బీఆర్‌ఎస్

05-05-2024 12:39:06 AM

ఎమ్మెల్సీ దండె విఠల్

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 4 (విజయక్రాంతి): ప్రజల కష్టాలు తెలిసిన పార్టీ బీఆర్‌ఎస్ అనిఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామాలలో పర్యటించారు. గ్రామస్తులను ఓట్లు అభ్యర్థించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును గెలిపించాలని విజ్ఞాప్తి చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అబద్ధపు హామీలు ఇస్తున్నాయని మండ్డి పడ్డారు. అనంతరం పార్టీలో చేరిన 70 మందికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ప్రచారంలో నాయకులు మహేష్, విజయ్, పాపయ్య, రాజారం, బాపూరావు, ఆశోక్, వినోద్, శ్రీకాంత్, సంతోష్ పాల్గొన్నారు.