హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేత హరీశ్ రావు బహిరంగలేఖ రాశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అగమ్యగోచరంగా మారిందని హరీశ్ రావు మండిపడ్డారు. విద్య,ఉపాధి వంటి పథకాలు ఆగిపోవడం విచారకరమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమాన్ని విస్మరించిందని హరీశ్ రావు మండిపడ్డారు. పేద బ్రాహ్మణులకు సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని ఆయన సీఎంను కోరారు.