calender_icon.png 26 September, 2024 | 1:50 AM

తమిళనాడుకు బీఆర్‌ఎస్ బీసీ నేతలు

25-09-2024 03:23:00 AM

బీసీ రిజర్వేషన్లపై అధ్యయనం 

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): తమిళనాడులో బీసీల సంక్షేమం కోసం అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల అధ్యయనానికి బీఆర్‌ఎస్‌కు చెందిన బీసీ నాయకులు పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు తెలంగా ణ భవన్‌లో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, శాసనమండలిలో బీఆర్‌ఎస్ పక్ష నేత సిరికొండ మధుసూదనాచా రి, మాజీ మంత్రులు జోగు రామన్న, వీ శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, బూడిద బిక్షమయ్య గౌడ్‌తో సమావేశమయ్యారు.

బీసీ నాయకులతో కేటీఆర్ పలు అంశాలపై లోతుగా చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ బీసీ కమిషన్ మాజీ సభ్యులు జూలూరు గౌరీశంకర్, ఆంజనేయులు గౌడ్, శుభప్రద పటేల్, ఉపేంద్రాచారి, కిశోర్ గౌడ్, నాయకులు చిరుమళ్ల రాకేష్, గెల్లు శ్రీనివాస్‌యాదవ్, రాజారాం యాద వ్ తదితరులు పాల్గొన్నారు.