calender_icon.png 23 October, 2024 | 3:55 AM

మాన్య, ధరణికి కాంస్యాలు

10-07-2024 12:20:36 AM

హైదరాబాద్ సెయిలింగ్ వీక్

హైదరాబాద్, ఖేల్ ప్రతినిధి: హైదరాబాద్ సెయిలింగ్ వీక్‌లో తెలంగాణకు చెందిన మాన్య రెడ్డి, లావేటి ధరణి కాంస్య పతకాలతో మెరిశారు. ఈఎమ్‌ఈ సెయిలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 38వ సెయిలింగ్ వీక్ ఐఎవసీఏ 4 మహిళల విభాగంలో మాన్య రెడ్డి, ఐఎల్‌సీఏ 6 ఈవెంట్‌లో లావేటి ధరణి కంచు పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న లెఫ్టినెంట్ జనరల్ నీరజ్ వర్ష్నే పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు.