27-04-2025 02:51:21 PM
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని తర్ణం వాగుపై ఉన్న పాత వంతెనను అధికారులు డిటోనేటర్లతో పేల్చివేశారు. 2023 సంవత్సరంలో బ్రిడ్జ్ కు బీటలు వారడంతో అధికారులు రాకపోకల నిలిచివేశారు. దింతో జైనథ్, బేల మండలాలతో పాటు మహారాష్ట్ర ప్రజలకు వంతెన పై నుండి రాకపోకలు నిలిచిపోయాయి. కాగా ఇటీవల జాతీయ రహదారి పనుల్లో భాగంగా కొత్త బ్రిడ్జి నిర్మాణానికై పాత బ్రిడ్జిని ఆదివారం నేషనల్ హైవే అధికారులు డిటోనేటర్ల సహాయంతో పేల్చివేశారు.