జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
గద్వాల, జనవరి31 (విజయక్రాంతి): జములమ్మ బ్మ్రెత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ సంబంధిత అధికా రులకు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాల యంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు జములమ్మ బ్మ్రెత్సవములపై సంబంధిత శాఖల అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సంద ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫిబ్రవరి 4 నుంచి 12 వరకు నిర్వహించే బ్మ్రెత్సవములు ఘనంగా నిర్వ హించేందుకు సంబంధిత అధికారులు అందరూ ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి మంగళవారం, శుక్ర వారం దేవాలయానికి ఎక్కువ మంది వస్తారని దష్టిలో ఉంచుకుని, ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధి కారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మి నారాయణ,ఆర్డీఓ శ్రీనివాస రావు,ఈ.ఓ పురేందర్, గద్వాల్ తహసీల్దార్ మల్లికార్జున్ మున్సి పల్ కమిషనర్ దశరథ్, ఎక్సైజ్ అధికారి వీరేశ లింగం, సి.ఐ శ్రీను, సంబంధిత అధికారులు, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.