calender_icon.png 15 March, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపటి నుంచి సిద్ధ రామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు

14-03-2025 05:04:17 PM

బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధుల వెల్లడి

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో అత్యంత ప్రాచీన ఆలయం శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ బ్రహ్మోత్సవాలు శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆలయ కమిటీ అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేశారు. దక్షిణ కాశి గా ప్రసిద్ధి చెందిన సిద్ధరామేశ్వరాలయం భక్తుల కొంగుబంగారంగా కోరిన కోరికలు తీర్చే దేవునిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొని మొక్కలు తీర్చుకొనున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి దంపతులతో కలిసి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నీ ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు.

నీవు ఉత్సవాలకు మాజీ ప్రభుత్వ కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్  ఉత్సవాల్లో పాల్గొ ను న్నారు. కామారెడ్డి నిజాంబాద్ హైదరాబాద్ సిద్దిపేట రాజన్న సిరిసిల్ల జిల్లా మెదక్ సంగారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల నుంచి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ పూజారి రామగిరి శర్మ , రాజు శర్మ తో పాటు మరో ఇద్దరు పూజారులు నిత్యం సిద్దరామేశ్వర ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. సీతారామేశ్వర ఆలయంతో పాటు భువనేశ్వ రీ మాత  ఆలయం తో పాటు పలు ఆలయాలను భక్తులు సందర్శించి మొక్కులు తీర్చుకుంటారు. ఆ లైన్ కి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు మూల బావిలో స్నానం చేస్తే కష్టాలు తొలగి పోతాయని అని భక్తుల నమ్మకం.

బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న భక్తులు మూల బావిలో స్నానం చేసిన అనంతరం సిద్దరామేశ్వరుని దర్శించుకుంటారు అనంతరం భువనేశ్వరి దేవి ఆలయాన్ని దర్శించుకుని మొక్కులు చెల్లిస్తారు. ఓడి బియ్యం పోసి మహిళలు ముత్తైదువలు ఇద్దరమేశ్వరుని భువనేశ్వరి దేవిని వవేడుకుంటారు. కోరిన కోరికలు నెరవేరిచే దేవునిగా కామారెడ్డి జిల్లాలో ప్రసిద్ధి చెందిన సిద్ధరామేశ్వరాలయం బ్రహ్మోత్సవాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్ర శివారులో ఉన్న దక్షిణ కాశిగా పిలువబడే శ్రీ సిద్ధ రామేశ్వర ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఈనెల 19వ తేదీ వరకు కొనసాగుతాయని ఆర్య కార్య నిర్వహణ అధికారి పద్మశ్రీధర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆలయంలో నిర్వహించే బ్రహ్మోత్సవాలకు, వచ్చే భక్తుల కోసం సకల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాలని ఆయన కోరారు.