07-03-2025 12:00:00 AM
రాజేంద్రనగర్, మార్చి 6 (విజయ క్రాంతి): ప్రేమించిన యువతి ఇంటి వద్ద ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన మైలార్దేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాగ్ లింగంపల్లి కి చెందిన సోను (21) డిగ్రీ స్టూడెంట్. అతడు లక్ష్మీగూడ హౌసింగ్ బోర్డ్ కాలనీ బృందావనం కాలనీకి చెందిన ఎల్ ఎల్ బి చదువుతున్న యువతి (21) మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు.
ఇదిలా ఉండగా యువతి సోను ను కాదన డంతో మనస్థాపానికి గురయ్యాడు. గురు వారం యువతి ఇంటి ముందు ఉన్న మొద టి అంతస్తు పై ఎక్కి ఆత్మహత్య చేసుకుం టానని హల్చల్ చేసి ఫ్లోర్ క్లీనర్ తాగాడు. స్థానికులు గమనించి 100కు ఫిర్యాదు చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరు కున్న పెట్రోల్ మొబైల్ యువకుడ్ని మొదటి అంతస్తు పైనుంచి కిందికి దించి వెంటనే 108 అంబులెన్స్ లో అతనికి ప్రథమ చికిత్స చేశారు. ఎస్ఐ పైడి నాయుడు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.