calender_icon.png 19 October, 2024 | 3:58 PM

నిజామాబాదు లో బాలుడు కిడ్నాప్

19-10-2024 01:33:35 PM

జనరల్ ఆస్పత్రిలో తండ్రితో పడుకొని ఉన్న ఏడాది వయసు గల బాలుని ఎత్తుకెళ్లిన దుండగులు
సీసీటీవీ కెమెరాల్లో నమోదైన బాలుడి కిడ్నాప్ దుండగుల చిత్రాలు
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన బాలుడు 

నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుంచి ఏడాది వయస్సు గల బాలుడు కిడ్నాప్ గురైన ఘటన కలకలం రేపు తుంది. తల్లి అనారోగ్యంకు గురి కావడంతో తండ్రితో కలిసి ఆసుపత్రిలో బాలుడు మణికంఠ నిద్రించారు. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా మదునూరు మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ అనారోగ్యానికి గురి కావడంతో చికిత్స నిమిత్తం శుక్రవారం నిజాంబాద్ ఆసుపత్రికి తరలించారు. బెడ్ పై లక్ష్మి చికిత్స పొందుతుండగా లక్ష్మీ భర్త రాజు కుమారుడు మణికంఠ ఆసుపత్రి ఆవరణలో రాత్రి నిద్రించారు. గుర్తు తెలియని ముగ్గురు దుండగులు బాలుడు మణికంఠను రాత్రి ఎత్తుకెళ్లారు. శనివారం ఉదయం రాజు చూసే సరికి తన కుమారుడు మణికంఠ పక్కన లేకపోవడంతో భార్యా వద్ద వెతికాడు. అక్కడ కూడా లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణలో పరిశీలించి చూడగా ఎక్కడ కనిపించలేదు.

ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి సమాచారం అందించగా సీసీ కెమెరాలు పరిశీలించారు. బాలుడు మణికంఠను గుర్తు తెలియని ముగ్గురు దుండగులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లినట్లు సీసీ ఫుటేజ్ లో కనిపించడంతో ఒకటో టౌన్ పోలీసులకు రాజు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. బాలుడు మణికంఠను ఎవరికి కిడ్నాప్ చేశారని కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. గతంలో కూడా ఈ ఆస్పత్రిలో ఒక బాలుడు కిడ్నాప్ గురైన ఘటన మరవకముందే మరో బాలుడు కిడ్నాప్ గురి కావడం కలకలం రేపుతుంది. పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి బాలుని కోసం కిడ్నాప్ పాల్పడిన వ్యక్తుల ఆచూకీ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది. బాలుడు మణికంఠ తండ్రి రాజు ఫిర్యాదు మేరకు ఒకటవ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.