calender_icon.png 21 September, 2024 | 4:11 PM

వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి

17-07-2024 10:35:43 AM

హైదరాబాద్: సికింద్రాబాద్ జవహర్ నగర్ పరిధిలోని వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందాడు. ఇంటి దగ్గర ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్రగాయాలు కావడంతో బాలుడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.  మున్సిపల్ కమిషనర్ జవహర్ నగర్ దివ్యాంగుల కాలనీకి వెళ్లారు. అక్కడి స్థానికులు మున్సిపల్ కమిషనర్ ను అడ్డుకున్నారు. పలుమార్లు కుక్కలపై ఫిర్యాదు చసిన పట్టించుకోవడం లేదని నిలదీశారు. మృతిచెందిన బాలుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.