24-04-2025 10:34:43 PM
కామారెడ్డి జిల్లా పాల్వంచలో ఘటన...
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పాల్వంచలో జెసిబితో తీసిన గుంతలో నాలుగు సంవత్సరాల బాలుడు పడి మృతి చెందిన ఘటన వెలుగులోకి వచ్చింది. పాల్వంచలో గురువారం సాయంత్రం ఆటలాడెందుకు వెళ్లిన బాలుడు జెసిబితో తీసిన గుంతలో పడి చనిపోయాడు. ఈ విషయం రాత్రి తెలియడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. జెసిబితో గుంత తీసిన వ్యక్తి నష్టపరిహారం ఇప్పించాలని బాలుని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. అభము, శుభం తెలియని నాలుగు సంవత్సరాల బాలుడు పొక్లైన్ తీసిన గుంతలో పడి చనిపోవడం గ్రామస్తులను తీవ్రంగా కలచి వేసింది.