హైదరాబాద్: మంగళ్ హాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. కొండపై నుంచి పెద్దబండరాయి ఇంటిపై పడింది. ఇంట్లో రాత్రి నిద్రిస్తున్న సమయంలో బండారాయి నలుగురిపై పడింది. ఈ ప్రమాదంలో రెండేళ్ల బాలుడు మృతి చెందగా,మరో నలుగురికి తీవ్రగాయాలయ్యా యి. గాయపడిన క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.