calender_icon.png 22 September, 2024 | 4:03 PM

ఇద్దరిపై కత్తితో దాడి

22-09-2024 02:08:40 AM

నిందితుడి అరెస్ట్

కూకట్‌పల్లి, సెప్టెంబర్ 21: వినాయక నిమజ్జనం సందర్భంగా తలెత్తిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులపై కత్తితో దాడి చేసిన ఘటన కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. అమీర్‌పేటకు చెందిన జగ్‌జ్యోత్ సింగ్ శుక్రవారం రాత్రి కూకట్‌పల్లిలోని యాదవ బస్తీలో వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చాడు. ఈ క్రమంలోనే భజరంగ్‌దళ్, యాదవబస్తీకి చెందిన వినాయ క విగ్రహాలు రామాలయం వద్దకు చేరుకున్నాయి. ఆ సమయంలో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే తన స్నేహితులపై దాడి చేస్తారా అంటూ జగ్‌జ్యోత్ సింగ్ కూకట్‌పల్లికి చెందిన అవినాష్ రావు, నవీన్‌రావు అనే ఇద్దరిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. వారికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపు లోకి తీసుకొని కేసు నమోదు చేశారు.