calender_icon.png 14 October, 2024 | 8:11 AM

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఇద్దరి మరణం

14-10-2024 01:09:11 AM

కలుషిత నీరు తాగడంతోనే వారు చనిపోయారు

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాం తి): కలుషిత తాగునీరు తాగి సంగారెడ్డి జిల్లా లో ఇద్దరు మరణించడానికి కాంగ్రెస్ ప్రభు త్వం నిర్లక్ష్య వైఖరే కారణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఈ సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రమంతటా తాగునీరు సరఫరా చేయడానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ ప్రాజెక్టు పూర్తి చేసిందని తెలిపారు.

కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి తాగు నీరు ఇచ్చే ఈ ప్రాజెక్టును కూడా రేవంత్ సర్కార్ సక్రమంగా నిర్వహించలేకపోతుందన్నారు. మరణించిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, చికిత్స పొందుతున్నవారికి తగిన సాయం అందించాలని కోరారు. ఇలాంటి దురదృష్టకరమైన ఘటనలు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.