22 May, 2026 | 9:01 PM

Breaking News

చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •   'డ్రంక్ అండ్ డ్రైవ్'లో రూ.2లక్షలకుపైగా జరిమానా   •   భిక్కనూరులో ఆర్టీసీ బస్సు ప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం   •   ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి   •   జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త   •   శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •  

60 దాటితేనే బాస్!

09-03-2025 12:00 AM

పని, ఫలితాలు.. అనగానే సాధారణంగా మనందరికీ యువతరమే గుర్తుకొస్తుంది. వయసైన వాళ్లతో పోలిస్తే.. 20-30 ఏళ్ల వాళ్లు ఏదైనా సాధిస్తారని అనుకుంటాం. కాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వ్యాపార సంస్థలు మాత్రం సీనియర్ పదవుల్లోకి 60 దాటిన వాళ్లే అర్హులని భావిస్తున్నాయట. ‘న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’ వెలువరించిన నివేదికల ప్రకారం.. ఒక వ్యక్తి జీవితంలో 60-70 ఏళ్ల మధ్య వయసులోనే ఎక్కువ ఉత్పాదకతని అందిస్తాడట.

ఇందుకు కారణం.. అప్పటివరకూ సాధించిన విషయ పరిజ్ఞానం, జీవితానుభవం, సంపద అతన్ని స్వేచ్ఛగా, ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకునేలా చేస్తాయట. అలాగే 70--80 మధ్య వయసుని రెండో ఉత్పాదకత దశగా భావించొచ్చట. ఇక మూడో దశ అంటే 50-60 ఏళ్ల మధ్యలో ఉంటుందట. ఫార్చ్యన్ 500 జాబితాలో ఉన్న సీఈవోల సగటు వయసు 63 ఏళ్లట.

అలాగే నోబెల్ బహుమతి విజేతల సగటు వయసు 62 ఏళ్లు. సో ఎవరి జీవితంలో అయినా 60-80 ఏళ్ల మధ్యకాలం అన్నివిధాలా అత్యుత్తమమైనదట. మీరు కానీ ఆ దశలో ఉంటే, ఈ వయసులో ఏం చేస్తాం అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా చేయడానికి ఇదే సరైన వయసు అంటోందీ అధ్యయనం.