calender_icon.png 9 October, 2024 | 6:52 AM

రెండో రౌండ్‌కు బోపన్న జోడీ షాంగై మాస్టర్స్

05-10-2024 12:00:00 AM

షాంగై: షాంగై మాస్టర్స్ టోర్నీలో భారత టెన్నిస్ డబుల్ స్టార్ రోహన్ బోపన్న జోడీ రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. బోపన్న- డోడిగ్ (క్రొయే షియా) ద్వయం 6-4, 6-3 తేడాతో మార్టినెజ్-కర్రెనో (స్పెయిన్) జోడీపై విజయం సాధించి రెండో రౌండ్‌కు చేరుకుంది. ఈ మ్యాచ్ 63 నిమిషాల పాటు సాగింది. మ్యాచ్‌లో బోపన్న జోడీ ఐదు ఏస్‌లు సంధించింది. మూడు డబుల్ ఫాల్ట్స్ చేసినా కానీ బోపన్న జోడీ మాత్రం మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.

ఇక సింగిల్స్ విషయానికి వస్తే.. రష్యా స్టార్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో మెద్వెదెవ్ 7-5, 7-5తో బ్రెజిల్‌కు చెందిన విల్డ్‌పై సునాయాస విజయాన్ని అందుకొని రెండో రౌండ్‌కు చేరుకున్నాడు.

మిగిలిన మ్యాచ్‌ల్లో హంబర్ట్, డేవిడ్‌విచ్ ముందంజ వేశారు. ఇటీవలే చైనా ఓపెన్ నెగ్గిన కార్లోస్ అల్కరాజ్, రన్నరప్ జానిక్ సిన్నర్ నేరుగా బై లభించడంతో నేడు తొలి రౌండ్ ఆడనున్నారు. చైనాకు చెందిన షాంగ్‌తో అల్కరాజ్, టారో డేనియల్ (జపాన్)తో సిన్నర్ తలపడనున్నారు.