సెప్టెంబర్ 5న బోర్డ్ మీట్
షేర్హోల్డర్లకు బోనస్ బొనాంజాను అందించనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీచేసే ప్రతిపాదనను పరిగణనలోకి తీసుకునేందుకు తమ డైరెక్టర్ల బోర్డు సెప్టెంబర్ 5న సమావేశమవుతుందని ఆర్ఐఎల్ స్టాక్ ఎక్సేంజీలకు తెలిపింది. ఇంతకు ముందు 2017 సెప్టెంబర్లో రిలయన్స్ బోనస్ షేర్లను ఇచ్చింది.