calender_icon.png 6 October, 2024 | 1:31 AM

సన్నరకానికి రూ.500 బోనస్

05-10-2024 01:47:08 AM

కరీంనగర్, అక్టోబరు 4 (విజయ క్రాంతి): ఖరీఫ్ వరిధా న్యాన్ని క్వింటాలుకు రూ.500 బోన స్ చెల్లిస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఖరీఫ్ ధాన్యం కొనుగో లుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందనే అంచనాతో 258 కొను గోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని తెలిపారు.

సన్నరకం ధాన్యాలు జిల్లా లో 24,600 క్వింటాళ్ల వరకు కొను గోలు కేంద్రాలకు వస్తాయని అంచనాలు రూపొందించామన్నారు . గ్రేడ్ రకం ధాన్యానికి రూ.2,3 20, సాధారణ రకం ధాన్యానికి రూ.2,300 మద్దతు ధర చెల్లిం చనున్నట్టు తెలిపారు. రైతులకు టోకె న్ పద్ధతిలో మాత్రమే ధాన్యం సెంట ర్‌కు తీసుకుని వచ్చి, కొనుగోలు చేసే విధంగా చూడాలని అన్నారు.