calender_icon.png 25 March, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బోనమెత్తి... అగ్ని గుండాలు తొక్కి..

24-03-2025 12:25:30 AM

చేవెళ్ల, మార్చి 23: మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని సురంగల్ మల్లికార్జున స్వామి వారి నామస్మరణతో మార్మోగింది. ఆదివారం గ్రామంలో బోనా ల ఉత్సవాన్ని గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు.   

మహిళలు బో నాలు నెత్తిన పెట్టుకొని గ్రామం నుంచి మల్లికార్జున స్వామి ఆలయం వరకు డోలు వాయిద్యాల మధ్య, పోతురాజుల విన్యాసాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అగ్ని గుండాలు తొక్కే కార్యక్రమం భక్తి శ్రద్ధలతో, తన్మయత్వంతో సాగింది. అం తకుముందు స్వామి, అమ్మవార్ల కల్యాణ  మహోత్సవాన్ని కనుల పండువగా జరిపారు.  భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శనం చేసుకున్నారు.