09-04-2025 12:06:04 AM
ముషీరాబాద్, ఏప్రిల్ 8 (విజయక్రాంతి) : ముషీరాబాద్కు చెందిన బీసీ సంక్షేమ సంఘం మహిళా కమిటీ అధ్యక్షురాలు కళావతి ఆధ్వర్యంలో బల్కంపేట ఎల్లమ్మకు మంగళవారం బోనాలు సమర్పించారు. బీసీ బిల్లు ఆమోదం పొందడం కోసం బోనాలు సమర్పించినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నగర అధ్యక్షుడు రాజేందర్, టీఆర్ గోవింద్, మహిళా కమిటీ నాయకులు మహేశ్వరి, శివాని తదితరులు పాల్గొన్నారు.