calender_icon.png 23 October, 2024 | 12:54 PM

ఢిల్లీలో ముగిసిన బోనాల ఉత్సవాలు

11-07-2024 12:06:58 AM

బంగారు బోనం ఎత్తుకున్న తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ 

మహేశ్వరం, జూలై 10: ఢిల్లీలో మూడు రోజుల పాటు అట్టహాసంగా నిర్వహించిన లాల్‌దర్వాజ బోనాల ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా దేవాలయ కమిటీ చైర్మన్ సీ రాజేందర్ యాదవ్, కన్వీనర్ జీ అరవింద్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మొద టి రోజు ప్రముఖులు ఎగ్జిబిషన్ తిలకించారు. రెండో రోజు ఇండియా గేట్ వద్ద ఘటాల ఊరేగింపు వేడుకలను నిర్వహించగా, హర్యా నా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ ము ఖ్య అతిథులుగా హాజరయ్యారు. బుధవారం నిర్వ హించిన వేడుకల్లో జోగిని రాకేశ్ నెత్తిన బంగా రు బోనం ఎత్తుకొని ఢిల్లీ వీధుల్లో  నృత్యం చేయడం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బంగారు బోనం నెత్తిన ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్నారు. లాల్‌దర్వాజ సింహవా హిని శ్రీ మహంకాళి దేవాలయ కమిటీ ప్రతినిధులు, కళాకారులు పాల్గొన్నారు.