calender_icon.png 19 October, 2024 | 1:11 PM

విస్తారా విమానానికి బాంబు బెదిరింపులు

19-10-2024 10:20:37 AM

హైదరాబాద్: ఢిల్లీ నుంచి లండన్‌కు బయలుదేరిన విస్తారా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో శుక్రవారం ఫ్రాంక్‌ఫర్ట్‌కు దారి మళ్లించారు. శనివారం తెల్లవారుజామున ఒక ప్రకటనలో, విమానయాన సంస్థ ప్రతినిధి ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారని, ప్రస్తుతం తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భద్రతా ఏజెన్సీ అనుమతి ఇచ్చాక విమానం లండన్ వెళ్లనుంది. విమానాల్లో బాంబులున్నాయని 4 రోజుల వ్యవధిలో 35 నకిలీ కాల్స్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

 "అక్టోబర్ 18, 2024న ఢిల్లీ నుండి లండన్‌కు నడుపుతున్న విస్తారా ఫ్లైట్ UK17కి సోషల్ మీడియాలో సెక్యూరిటీ బెదిరింపు వచ్చింది. ప్రోటోకాల్‌కు అనుగుణంగా, సంబంధిత అధికారులందరికీ వెంటనే సమాచారం అందించారు. ముందు జాగ్రత్త చర్యగా, పైలట్‌లు విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌కు మళ్లించాలని నిర్ణయించుకున్నారు. "అని ప్రతినిధి చెప్పారు. ఇదిలావుండగా, శుక్రవారం బెంగళూరు నుంచి ముంబైకి వెళ్లాల్సిన QP 1366 విమానానికి బయలుదేరే కొద్దిసేపటి ముందు భద్రతా హెచ్చరిక అందిందని అకాసా ఎయిర్ తెలిపింది. గత కొన్ని రోజులుగా, భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న దాదాపు 40 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి, అవి బూటకమని విమానయాన అధికారులు తెలిపారు. విమానయాన సంస్థలకు బూటకపు బాంబు బెదిరింపుల సంఘటనలను నివారించడానికి కఠినమైన నిబంధనలు అమలు చేయాలని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ యోచిస్తోంది.