తమిళనాడు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 26: తిరుపతిలోని హోటళ్లకు బాంబు బెదిరిం పుల సంఖ్య రోజు రోజుకూ ఎక్కువవుతున్నాయి. శుక్రవారం తిరుప తిలోని కొన్ని హోటళ్లకు బూటకపు బాంబు సందేశాలు రాగా శనివారం రాజ్ పార్క్, పాయ్ వైశ్రాయ్ హోటళ్లకు బాంబు బెదిరింపులతో మెయి ల్స్ అందాయి. డ్రగ్స్ కేసులో కొద్ది రోజుల క్రితం అరెస్టున జాఫర్ సాధిక్ పేరుతో వచ్చిన మెయిల్లో ఆగంతకులు సంచలన ఆరోపణలు చేశారు. జాఫర్ సాధిక్తో తమిళనాడు ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నట్టు మె యిల్ పేర్కొన్నారు. ఇందులో ప్రధానంగా తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ భార్య పేరును ప్రస్తావించారు. జాఫర్ సాధిక్ ఇష్యూ నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు బాంబు పేలుళ్లకు ప్లాన్ చేశారని ఆరోపణలు చేశారు. ఇందుకోసం ఏకంగా తమిళనాడు డీజీపీ పాక్లోని ఐఎస్ఐ సభ్యులను సంప్రదించినట్లు మెయిల్లో రాసుకొ చ్చారు. కాగా.. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును ముమ్మరం చేశారు.