హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని దుండగుడు రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఫోన్ చేయపడంతో విమానాశ్రయ సిబ్బంది విశాఖ నుంచి ముంబాయి బయల్దేరిన ఇండిగో విమానాన్ని వెనక్కి రప్పించారు. ప్రయాణికులకు దింపి విమానాన్ని భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. దీంతో విమానంలో బాంబు లేదని తేలడంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి ముంబయి బయలుదేరేందుకు సిద్ధమైన ఇండిగో విమానం, కానీ మూడు గంటలు ఆలస్యంగా వెళ్లనుంది.