calender_icon.png 17 October, 2024 | 9:50 PM

మృతదేహం లభ్యం

16-10-2024 02:09:47 AM

కార్వాన్, అక్టోబర్ 15: మూసీ నదిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగ ళవారం వెలుగు చూసింది. ఇన్‌స్పెక్టర్ రఘుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లంగర్‌హౌస్‌లోని త్రివేణి సంగమ ఆలయ సమీపంలోని మూసీలో మృతదేహాన్ని చూశామని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీయించారు. ప్రమాదవశాత్తు వ్యక్తి మూ సీలో పడి మృతిచెంది ఉండొచ్చని పోలీసులు తెలిపారు.

మహిళ బలవన్మరణం

చిన్నశంకరంపేట (చేగుంట), అక్టోబర్ 15: మనస్తాపంతో ఓ మహిళ బలవన్మరణానికి పాల్పడిన ఘటన చిన్నశంకరంపేట మండల కేంద్రంలో జరిగింది. ఎస్సై నారాయణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నశంకరంపేటకు చెందిన విభూతి యాదమ్మ(40)కు ముగ్గురు కుమార్తెలు. ఇద్దరు కొడుకులు.

ఈమె భర్త ఏడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్ప టి నుంచి ఆమె పనిచేస్తూ, పిల్లలను పోషిస్తున్నది. ఈనెల 13న చిన్నశంకరంపేటకు చెందిన మాల్తుం రాములు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె మన స్తాపం చెంది మంగళవారం తన గుడిసెలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది.  పోలీసులు కేసు నమోదు చేశారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు.. 

కొండపాక, అక్టోబర్ 15: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కొండపాకలో జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం.. దుద్దెడ గ్రామానికి చెందిన దయ్యాల మల్లేశం (45) సోమవారం రాత్రి బైక్ వెళ్తూ రాజీవ్ రహదారిని దాటుతున్నాడు. ఈ క్రమంలో కారు ఢీకొట్టింది. ప్రమాదంలో మల్లేశం తీవ్రగాయాల పాలయ్యాడు. కుటుంబ సభ్యులు హైదరాబా ద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మల్లేశం మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు.