28-02-2025 10:36:22 PM
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన వైనం..
విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినా కలెక్టర్..
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిక్కనూర్ బాలుర సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో శుక్రవారం రాత్రి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ బస చేశారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం విద్యార్థులతో ఇంటరాక్ట్ అయ్యారు. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని కష్టపడి చదవాలని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.