calender_icon.png 2 October, 2024 | 8:01 AM

నెత్తురోడిన రహదారులు

02-10-2024 01:08:32 AM

ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో ముగ్గురు మృతిచెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు.

ఇల్లెందు, అక్టోబర్ 1: ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండా బొడ్రా స్‌కుంట వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, ఒక రి పరిస్థితి విషమంగా ఉంది. సింగరేణి మం డలం గుట్టమీద గుంపు గ్రామానికి చెందిన ఉం డం సూర్యనారాయణ(45), సుగుణ (40) దం పతులు పని నిమిత్తం ఇల్లెందు వెళ్లి  ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరారు.

సింగరేణి సోలార్‌ప్లాంట్‌లో ఎలక్ట్రికల్ ఇంజనీరుగా విధు లు నిర్వహిస్తున్న శ్రీకాకు ళం నివాసి నక్క వెంక టేశ్(35), ధరావత్ రాజు కారేపల్లి  నుంచి మరో ద్విచక్రవాహనంపై ఇల్లెందు వైపు వెళ్తున్నారు. భాగ్యనగర్ తండా బొడ్రాస్‌కుంట వద్ద రెండు వాహనాలు ఎదరెదురుగా ఢీ కొనడం తో సూర్యనారాయణ, సుగణ, నక్క వెంకటేశ్ అక్కడికక్క డే మృతి చెందారు.

తీవ్రంగా గాయపడిన ధరావత్ రాజును ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నది. సూర్యనారాయణ, సుగుణలకు ఇద్దరు పిల్ల లు ఉన్నారు. కారెపల్లి పోలుసుల కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

ఐదుగురి ప్రాణాలు తీసిన అతివేగం

ఆదిలాబాద్(విజయ్‌క్రాంతి): ఆదిలాబాద్‌లోని టీచర్స్ కాలానీకి చెందిన ఎలక్ట్రి సిటీ కాంట్రాక్టర్ మొయి జ్(60), బాబు అలీ(8), ఖాజా మొయినుద్దీ న్(40), మహమ్మద్ ఉస్మానుఉద్దీన్(11), ఫరీదుద్దీన్(14), ఆయేషా ఆఫ్రిన్, ఎఖ్రా, సాద్‌లది ఒకే కు టుంబం. సోమవారం నిర్మల్ జిల్లా భైంసా లో శుభకార్యానికి వెళ్లి అర్ధరాత్రి ఆదిలాబాద్‌కు కారులో తిరిగి వస్తు న్నారు.

ఆదిలాబా ద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకల గండి వద్ద కారు అతివేగంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంటు దిబ్బలను ఢీకొన్నట్టు తెలుస్తున్నది. ఈ ప్రమాదంలో మొయిజ్, బాబు అలీ, ఖాజా మొయినుద్దీ న్, మహమ్మద్ ఉస్మానుఉద్దీన్, ఫరీదుద్దీన్ మృతిచెందారు. ఆయేషా ఆఫ్రిన్, ఎఖ్రా, సా ద్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద స్థలాన్ని మంగళవారం ఎస్పీ పరిశీలించారు.