06-03-2025 07:35:04 PM
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం రెడ్ క్రాస్ సొసైటీ, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు అత్యవసరంగా బ్లడ్ అవసరం ఉన్నందున రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 50 యూనిట్ల బ్లడ్ సేకరించారు. ఈ కార్యక్రమంలో సహకరించిన కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్ తో పాటు డోనర్ సభ్యులను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చైర్మన్ రాజన్న, సెక్రటరీ రఘుకుమార్ వారిని అభినందించారు.
కామారెడ్డిలో బ్లడ్ లేక ఎవరికీ ప్రాణహాని కాకూడదని అందుకు మీరందరూ సహకరిస్తూ, కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా యువత ముందుకు వచ్చి సభ్యత్వాన్ని స్వీకరించాలని వారు కోరారు. కొత్తగా పదిమంది చేరిన సభ్యులను ప్రత్యేకంగా పేరుపేరునా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎం రాజన్న, సెక్రటరీ రఘుకుమార్, కామారెడ్డి బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిరణ్, ఆర్గనైజర్లు శివ, పుట్ట చంద్రశేఖర్, విలాస్, శ్రీకాంత్, రాజు, రవి, మహి పటేల్, కుమార్, సాయి వైద్య అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.