జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్
జనగామ,(విజయక్రాంతి): రక్తదానం చేస్తే మరొకరికి ప్రాణదానం చేసినట్లేనని జనగామ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. పోలీసు అమరవీరుల స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం జనగామలోని జూబ్లీ గార్డెన్స్లో పోలీసు శాఖ, రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీసీపీ రాజమహేంద్రనాయక్ శిబిరాన్ని ప్రారంభించి తాను మొదట రక్తదానం చేశారు. రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాన్ని నిలపడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. రక్తదానంలో 221 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ పార్థసారథి, జనగామ సీఐ దామోదర్రెడ్డి, నర్మెట సీఐ అబ్బయ్య, ఎస్సైలు రాజేశ్, చెన్నకేశవులు, భరత్, శ్వేత, జనగామ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ లవకుమార్ రెడ్డి, ప్రముఖ వైద్యులు సీహెచ్.రాజమౌళి, రెడ్ క్రాస్ కార్యదర్శి, లయన్స్ మాజీ జిల్లా గవర్నర్ కన్న పరశురాములు, డాక్టర్ పి.కరుణాకర్ రాజు, ఎం.దివ్య తదితరులు పాల్గొన్నారు.